Tuesday, April 30, 2024

Breaking | చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి.. కుటుంబ కలహాలతో ఆత్మహత్య

సూర్యాపేట రూరల్, ప్రభ న్యూస్: నల్గొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్​ ఆత్మహత్య యత్నం చేసుకోగా.. చికిత్స చికిత్స పొందుతూ ఇవ్వాల చనిపోయాడు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్ గా పని చేస్తున్న మధు బుదవారం ఉదయం మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఈనెల 6వ తేదీన గడ్డి మందు తాగినట్లు అతని బంధువులు తెలిపారు.

ఆ రోజే మధును మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చికిత్స పొందుతూ ఇవ్వాల ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. మృతునికి వివాహం జరగగా సంతానం లేదు. నల్లగొండ జిల్లా వేముల పల్లి మండలం ఆమనగల్ మధు స్వస్థలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement