Tuesday, April 30, 2024

న‌న్ను చంపేందుకు కుట్ర‌.. క‌రాటే క‌ళ్యాణి

సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బిజెపి పార్టీలో చేరింది న‌టి క‌రాటే క‌ళ్యాణి. దాంతో ఆమె హిందుత్వం అజెండాను తలెత్తుకుని ఎప్పటికప్పుడు హడావుడి చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో విగ్రహం కృష్ణుడిని పోలి ఉందని తమ కుల దైవమైన కృష్ణుడిని కించ పరిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ కోర్టుకు వెళ్లి విగ్రహం ఏర్పాటును కూడా ఆమె అడ్డుకున్నారు.అలా చేయడం వల్ల ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ కూడా అయింది. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సమాధానం చెప్పాలంటే ఆమెకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు.

అయితే తాజాగా తనను చంపేందుకు ప్లాన్ చేశారని తనకు ప్రాణహాని ఉందని దాడి కూడా చేసేందుకు ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఈ మధ్యనే తన కొత్త కారు రెండు టైర్లను గుర్తుతెలియని వ్యక్తులు కోసేసారని ఆమె ఆరోపించారు.హిందుత్వం వాదులతో కలిసి కారులో వెళ్తున్నానని ఒక గుడి దగ్గర ఏదో గొడవ జరుగుతుంటే అక్కడికి వెళ్లి తిరిగి ఒక డొంక రోడ్ లో వస్తున్న సమయంలో కారు టైర్ పేలిపోయిందని వెల్లడించారు. డొంక రోడ్డు కాబట్టి నెమ్మదిగా వెళుతున్నాం పెద్ద ప్రమాదం ఏమి జరగలేదు. అదే హైవే మీద పేలిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి బతికి ఉండే దాన్నో లేదో చెప్పలేను అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రమాదం తర్వాత కారు టైరు చూసిన మెకానిక్ లు ఆ టైరును ఎవరో ముందే కోశారని చెప్పారని తన మీద కోపంతోనే ఎవరో ఇలా చేశారని ఆమె వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement