Sunday, April 28, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఐఎస్ ఐ మ‌ద్ద‌తుదారుల కుట్ర‌-భ‌గ్నం చేసిన పోలీసులు

పాకిస్తాన్ కి చెందిన ఐఎస్ ఐ మ‌ద్ద‌తుదారుల కుట్ర‌ల‌ను భగ్నం చేశారు పోలీసులు..న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ పంజాబ్ లో ఉగ్ర ముఠా కలకలం రేపింది. ఉగ్ర ముఠా నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు, ఒక ఐఈడి, రెండు పిస్టళ్లు, 40 క్యాట్ట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను పంజాబ్-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. కెనడాకు చెందిన అర్ష్ డల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ సింగ్ తో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశాం అని పంజాబ్ పోలీసులు ట్విట్టర్లో వెల్లడించారు. ఆ ముఠా నుంచి 3 హ్యాండ్ గ్రనేడ్లు (పి-86), ఐఈడీ, రెండు 9ఎం.ఎం. పిస్టళ్లు, 40 క్యాట్రిడ్జ్ లు సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ పంజాబ్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement