Sunday, April 28, 2024

మా పార్టీనే చావు నోట్లో పెట్టాం: జానారెడ్డి

హాలియా సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెచ్చానన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే త్యాగం చేశారా? అని ప్రశ్నించారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేశాకే తమ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. తాము కాంగ్రెస్ పార్టీని చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చామని స్పష్టం చేశారు.

తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని… తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా తాను ఎవర్నీ అడగలేదన్నారు. తన ఇంట్లోనే తెలంగాణ జేఏసీ పుట్టిందన్నారు. మావోయిస్టులతో చర్చలకు తానే కారణమని జానారెడ్డి పేర్కొన్నారు. అటు మండల కేంద్రాలను ఏర్పాటు చేసింది తానేనని జానా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement