Monday, April 29, 2024

KGF పాటను వాడేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీపై కాపీరైట్ కేసు నమోదు..!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ మ్యూజిక్ సంస్థ రాహుల్ గాంధీ సహా మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్‌ఆర్‌టీ సంస్థ కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్‌ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పై కేసు పెట్టింది. భారత్ జోడో యాత్ర కోసం తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. భారత్‌ జోడో యాత్ర ప్రచారం కోసం రూపొందించిన వీడియోలకు తమ అనుమతి లేకుండా కేజీఎఫ్‌-2 హిందీ పాటలను వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement