Saturday, April 27, 2024

Congress | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. ‘నారీ న్యాయ్‘లో భాగంగా మహిళలకు ఐదు హామీలను నేడు ప్రకటించారు.

శక్తివంతమైన మహిళలు భారతదేశ భవితవ్యాన్ని మారుస్తారని ఉద్ఘాటించారు. ముగ్గురిలో ఒక మహిళ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని, పది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక్క మహిళ మాత్రమే ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు. భారతదేశంలో మహిళా జనాభా 50 శాతం ఉందని, సెకండ‌రీ, ఉన్నత విద్యలో మహిళల వాటా 50 శాతంగా ఉందని, వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎందుకు తక్కువగా ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు 50 శాతం రిజ‌ర్వేష‌న్‌తో పాటు మొత్తం ఐదు హామీలను ప్రకటించారు.

నారీ న్యాయ్‘ – మహిళలకు ఐదు హామీలు..

  • భారతదేశంలోని ప్రతి పేద కుటుంబానికి చెందిన మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది.
  • పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ పదవులకు వచ్చే కొత్త రిక్రూట్మెంట్లలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తామని ప్రకటించారు.
  • ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది.
  • మహిళలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు, హక్కుల అమలులో సహాయం అందించేందుకు ప్రతి గ్రామ పంచాయితీలోనూ అధికార మైత్రిని నియమిస్తామని హామీ ఇచ్చింది.
  • ‘సావిత్రిభాయి పూలే హాస్టల్స్’ను ఏర్పాటు చేస్తామని, దీని కింద దేశంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వ రెట్టింపు చేస్తుందని, ప్రతిజిల్లాలో కనీసం ఒక హాస్టల్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement