Sunday, May 19, 2024

ఢిల్లీకి చేరిన వీహెచ్​.. ఖర్గేకు అభినందనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న మల్లికార్జున ఖర్గేను ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత రావు కలిసి అభినందించారు. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న వీహెచ్, మంగళవారం సాయంత్రమే ఖర్గేను కలిసి అభినందించారు. గాంధీ పరివారంపై ఎనలేని విధేయత ప్రదర్శించే ఇద్దరు నేతలు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి 24 ఏళ్ల తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న ఖర్గేకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement