Monday, April 29, 2024

దేశానికే మణిహారంగా కమాండ్ కంట్రోల్ రూమ్ : మంత్రి త‌ల‌సాని

కమాండ్ కంట్రోల్ దేశానికే మణిహారంగా నిల్వనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ లతో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
అత్యాధునిక టెక్నాలజీతో సుమారు 600 కోట్ల రూపాయల వ్యయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈనెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయాల నుండి కూడా శాంతిభద్రతల ను పర్యవేక్షించడం జరుగుతుందని వివరించారు. ఇక్కడి నుండి తక్షణం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయబడతాయని చెప్పారు. రానున్న రోజుల్లో కమాండ్ కంట్రోల్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయం కానున్నదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement