Friday, April 19, 2024

ద్ర‌వ్యోల్బ‌ణంపై చ‌ర్చ‌-ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగ్ ని దాచిన ఎంపీ

ద్ర‌వ్యోల్బ‌ణం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా రూ.1.6ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన హ్యాండ్ బ్యాగ్ ని లోక్ స‌భ‌కి తీసుకురావ‌డం వైర‌ల్ గా మారింది. మోయిత్రాతో ఉన్న బ్యాగ్ విలువ 1.6 లక్షల రూపాయలు. మహువా మొయిత్రా అత్యంత ఖరీదైన బ్యాగ్‌ని తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.. లోక్‌సభలో ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తన రూ.1.6 లక్షల లూయిస్ విట్టన్ బ్యాగ్‌ను దాచిపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధరల పెంపుపై మాట్లాడేందుకు లేచి నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కకోలి ఘోస్ట్ దస్తీదార్‌ను కెమెరా ఫోక‌స్ చేయ‌డంతో ఆమె పక్కనే కూర్చున్న మహువా మోయిత్రా త‌న ప‌క్క‌నే ఉన్న లూయిస్ విట్టన్ బ్యాగ్ తీసుకుని కింద పెట్టారు. ల‌క్ష‌ల విలువ చేసే ఆ బ్యాగ్ ను కెమెరాకు కనిపించ‌కుండా పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంపీ లోక్‌సభ కెమెరాకు కనిపించకుండా బ్యాగును కాళ్ల దగ్గర పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement