Monday, April 29, 2024

రాష్ట్ర‌ప‌తి ఎన్నికలో ఓటేసిన సీఎం కేసీఆర్

రాష్ట్ర అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కూడా ఓటు వేశారు. విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement