Monday, April 29, 2024

గాంధీ ఆస్ప‌త్రిలో బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్ప‌త్రిలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు. గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ దవాఖాన ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకుముందు సికిద్రాబాద్‌ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement