Thursday, May 2, 2024

TS: దేశ రాజ‌కీయాల్లో సీఎం కేసీఆర్‌ చారిత్ర‌క మార్పు తేవాలి.. తిరుమ‌ల శ్రీ‌వారిని కోరుకున్న శ్రీ‌నివాస్ గుప్తా!

తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా ఇవ్వాల (గురువారం) కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లంతా పాడి పంట‌లతో స‌స్య‌శ్యామ‌లంగా, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని వేంక‌టేశ్వ‌ర‌స్వామిని కోరుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

అంతేకాకుండా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాల‌ని, దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం క‌లించేలా ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టాల‌ని ఆ ఏడుకొండల స్వామిని కోరుకున్న‌ట్టు ఉప్పల శ్రీనివాస్​ గుప్తా తెలిపారు. యావ‌త్ దేశ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ మాదిరిగానే అభివృద్ధి ప‌థ‌కాల‌ను అందించే అవ‌కాశాన్ని కేసీఆర్‌కు వ‌చ్చేలా చూడాల‌ని ప్రార్థించిన‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement