Saturday, May 4, 2024

పీవీ సింధుకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు.. కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించడంపై హర్షం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కామన్‌వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో పీవీ సింధు స్వర్ణ పతకం సాధించడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పీవీ సింధూకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలతో కూడిన ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

రాష్ట్ర ప్రజలకు మొహర్రం పండుగ శుభాకాంక్షలు..

మతాలకతీతంగా హిందూ ముస్లింల సఖ్యతను, ఐఖ్యతను గంగా జెమునా తెహజీమ్‌ను మొహర్రం పండుగ చాటి చెబుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. త్యాగ నిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం పండుగ అని చెప్పారు. తెలంగాణలో ఈ పండుగను ముస్లింలతోపాటు హిందువులు కూడా జరుపుకుంటారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement