Thursday, April 25, 2024

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వంపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష..

గడప గడపకూ మన ప్రభుత్వం కార్య‌క్ర‌మం పై సీఎం జగన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్ ఛార్జుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు. అలాగే స‌మావేశంలో ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది మే నుంచే గడప గడపకూ మన ప్రభుత్వం మొదలైంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ పలు రకాల సర్వేలు చేయించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పర్ఫామెన్స్ పై ఇప్పటికే సీఎం జగన్ కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. గడప గడపకూ  మన ప్రభుత్వం ద్వారా ప్రజల ఇళ్లకు వెళ్తున్న వారిలో సరిగ్గా పర్ఫామ్ చేయని ఎమ్మెల్యేలకు జూన్ నెల వరకు గడువు ఇచ్చే అవకాశముంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement