Thursday, March 28, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ఒకరి అరెస్ట్

ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 957గ్రాముల బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుని వద్ద అక్రమంగా తరలిస్తున్న 957 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దీంతో అధికారులు దానిని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.46.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా అధికారులు కట్టడి చేస్తున్నా..స్మగ్లర్స్ మాత్రం తమదారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement