Wednesday, May 8, 2024

రేపు విజ‌య‌వాడ‌కు సీఎం జ‌గ‌న్

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకొక‌ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం. ఈ నేపథ్యంలో అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో రేపు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు సీఎం జగన్ రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement