Monday, April 29, 2024

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం జగన్ తీపికబురు..

అమరావతి: కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తోంది. పలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీకోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి (మరో 411 ఎస్పై పోస్టులు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి). వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement