Sunday, April 28, 2024

క్రిస్మస్‌ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలి : సీఎం జగన్

కడప బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం పులివెందుల లోని బాకరాపురం చర్చిలో కుటుంబ సభ్యులతో కలసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం పులివెందుల నుంచి కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలు వెళ్ళారు.

చివరిరోజు క్రిస్మస్ వేడుకల్లో…
సీఎస్ఐ టౌన్ చర్చి పాస్టర్ క్రిస్మస్ పండుగ సందేశాన్ని స్వీకరించిన అనంతం కుటుంబం సభ్యులతో కలసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం చర్చి అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రతి ఏడాది తన సొంత గడ్డపై ఇదే చర్చిలో కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా.. ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. దేవుడి కృప ఎల్లవేళలా ఉంటాయని విశ్వసిస్తూ.. రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ పండుగ ఆనందలను, సంతోషాలను నింపాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. చర్చిలో ముఖ్యమంత్రితో పాటు క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్న ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, భారతమ్మ, సత్యవతమ్మ, మాధవీలత తదితర బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జెడ్పి ఛైర్మెన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఏఎస్పీ తుషార్ డూడీ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తదితరుల హాజరయ్యారు. 10.30 గంటలకు సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు ముగించుకుని బాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని.. ఉదయం 10.50 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా కడప విమానాశ్రయం బయలుదేరి అక్కడినుంచి విజయవాడ వెళ్ళారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement