Thursday, April 25, 2024

విగ్రహాల ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరు జిల్లా కుప్పం మండలం గోనుగూరు సుబ్రహ్మణ్యస్వామి గుడిలో విగ్రహాల ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేని మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. జ్యోతి అనే మహిళ మద్యం మత్తులో విగ్రహాలు ధ్వంసం చేసిందని, ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒప్పుకుందని తెలిపారు. ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. ఆయన నిజనిజాలు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement