Sunday, April 28, 2024

Medak: ‘ఏం మధు అంతా ఒకేనా, నేనున్నా, గోఅహెడ్’.. అసెంబ్లీలో కేటీఆర్​ను కలిసిన చిట్కుల్ సర్పంచ్

ఏం మధు అంతా మంచిదేనా… అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చిట్కుల్ సర్పంచ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మధును ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం తన సన్నిహితులతో కలిసి అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు చిట్కుల్​ సర్పంచ్​ మధు. ఈ సందర్బంగా పూలబోకే అందించారు. చాకలి ఐలమ్మ జయంతికి పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఈ నెల 26న ఏర్పాటు చేయనున్న ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ను నీలం మధు ఆహ్వనించారు.

కాగా, ఈ కార్యక్రమానికి తాను తప్పకుండ హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ‘‘ఏం నడుస్తుంది.. అంతా మంచిదేనా? నేనున్నా గోఅహెడ్ బేటా’’ అని మధును మంత్రి కేటీఆర్ బుజం తడుతూ యేగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం బాగా పనిచేస్తున్నావని, కీపిటప్ అంటూ ప్రోత్సహించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న మీలాంటి యువత ఆదర్శమన్నారు కేటీఆర్​. ఈ సందర్భంగా మధుతో పాటు జాతీయ రజకసంఘాల కో ఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు, రజక సంఘం యూత్ అధ్యక్షుడు నల్లతీగల రాజు, కార్యదర్శి చాకలి వెంకటేష్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement