Thursday, May 2, 2024

కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ తో చిరంజీవి,నాగార్జున భేటి..

హైద‌రాబాద్ . ..కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి , అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు అనురాగ్‌ ఠాకూర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు గణేశుడి విగ్రహాన్ని బహూకరించారు.

ఠాకూర్‌తో సమావేశమైన విషయాన్ని తెలియజేస్తూ.. ఫొటోలను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. హైదరాబాద్‌కు అనురాగ్ ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన సంద‌ర్బంగా ఈ సీనియ‌ర్ హీరోలు ఆయ‌న‌తో స‌మావేశ‌మ‌య్యారు..భారతీయ చలన చిత్ర పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి నా సోదరుడు నాగార్జునతో కలిసి జరిపిన చర్చలు చాలా గొప్పగా జరిగాయి అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను కలిసిన వారిలో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement