చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇవ్వాల (శుక్రవారం) జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో భారత పరుషుల డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ ఇండోనేషియాకు చెందిన లియో రోలీ-డేనియల్ మార్థిన్లపై వరుస గేమ్ల 21-16, 21-14 తేడాతో విజయం సాధించి పురుషుల డబుల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
కాగా, ప్రస్తుతం రెండు చైనీస్ జంటలు (హీ జి టింగ్ -రెన్ జియాంగ్ యు & లియు యు చెన్ -ఔ జువాన్ యి) మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో పోటీపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జంటతో సెమీస్ లో తలపడనున్నారు సాత్విక్-చిరాగ్ లు .