Tuesday, May 7, 2024

Ram Mandir: టెంట్ నుంచి గ‌ర్భ‌గుడిలోకి బాల రాముడు…. ఇదే నిజ‌మైన దీపావ‌ళి – ప్ర‌ధాని మోడీ

ఇక మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ఇక నుండి రామ్ లల్లా రామ మందిరంలోనే ఉంటారని ప్రధాని చెప్పారు. దీంతో రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని ఆయన తెలిపారు. అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి ప్రసంగించారు.

ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడని పేర్కొన్నారు.ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడన్నారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. గర్భగుడిలో ఇప్పుడే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 2024 జనవరి 22 సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీకగా మోదీ పేర్కొన్నారు. ఇది కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయంగా వివరించారు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టంగా చెప్పారు.తన మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉందన్నారు. రామ మందిరాన్ని న్యాయ బద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించినట్టుగా గుర్తు చేశారు.

ఇప్పుడు అంద‌రూ బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారని ప్ర‌ధాని చెప్పారు. రాముడు భారత దేశ ఆత్మగా ఆయ‌న అభివ‌ర్ణించారు…అన్ని భాషల్లో తాను రామాయణాన్ని విన్నట్టుగా ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడన్నారు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంటుందని చెప్పారు. పవిత్ర అయోధ్యపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నట్టుగా చెప్పారు.ఈ క్షణం కోసం అయోధ్య వాసులు వందల ఏళ్లుగా ఎదురు చూశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడ దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 500 ఏళ్ల కల సాకారమైనందుకు దేశ ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్నారని మోడీ పేర్కొన్నారు. ఇవాళ రాత్రికి ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలన్నారు.

ఈ శుభ గడియల కోసం 11 రోజులుగా దీక్ష నిర్వహిస్తున్నట్టుగా మోడీ చెప్పారు. దేశంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. సాగర్ నుండి సరయూ నది వరకు రామ జపం నిర్వహించినట్టుగా చెప్పారు.రామ నామం.. దేశ ప్రజల ప్రతి కణకణంలో ఉందని పేర్కొన్నారు. రాముడు వివాదం కాదు….రాముడు సమాధానమని చెప్పారు. రాముడు నిత్యం…రాముడు నిరంతరం…రాముడు అనంతమని తెలిపారు.మన దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలమన్నారు. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యమని ప్రధాని చెప్పారు.ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనంగా పేర్కొన్నారు.ఈ క్షణం మన విజయానికే కాదు, వినయానికి కూడ సూచిక అని తెలిపారు.కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేపోయారన్నారు. 500 ఏళ్లుగా రాముడి ఆలయం ఎందుకు నిర్మాణం కాలేదో ఆలోచించాలని ఆయన దేశ ప్రజలను కోరారు. ఆయోధ్య రామ‌య్య‌ను దేశ ప్ర‌జ‌లంద‌రూ ద‌ర్శించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement