Monday, April 29, 2024

విశాఖ జిల్లాలో కిలాడీ లేడీ.. ప్రియుడితో కలిసి ప్లాన్.. పెళ్లి మీద పెళ్లిళ్లు

విశాఖ జిల్లా గాజువాకలో ఓ కిలాడీ మహిళ ప్రియుడితో కలిసి దారుణాలకు ఒడిగడుతోంది. ప్రియుడు శ్రీనివాస్ స్కెచ్ ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటూ భర్తలకు మస్కా కొడుతోంది. తొలుత జగదీశ్ అనే వ్యక్తితో పెళ్లి చేసుకున్న రేణుక.. పెళ్లి కాగానే మూడో నెల గర్భం రావడంతో భర్త అనుమానించి వదిలేశాడు. అయితే,… పుట్టబోయే పిల్లల ఖర్చు కోసం సదరు మహిళ రూ.లక్షలను ఫిక్సుడ్ డిపాజిట్ చేయించుకుంది.

మరోసారి తన పిన్ని కొడుకు ప్రసాద్‌ను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాలని ప్రియుడు శ్రీనివాస్ మరోసారి స్కెచ్ వేశాడు. ఈ నేపథ్యంలోనే ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న ప్రసాద్‌తో రేణుక సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు ప్రేమ పేరుతో ప్రసాద్‌ను పెళ్లి చేసుకుంది. కాపురం కోసమంటూ ప్రసాద్‌తో పాటు లక్నో వెళ్లిన ఆమె.. జీవీఎంసీలో జాబ్ వచ్చిందంటూ ప్రసాద్‌కు మస్కా కొట్టి విశాఖకు వచ్చేసింది. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదంటూ వివిధ సందర్భాల్లో కోటి రూపాయల వరకు అతనికి టోపీ పెట్టింది. ఇలాగే మరో ఇద్దరిని రేణుక మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధిత భర్తలు పోలీసులను ఆశ్రయించారు.

ఈ వార్త కూడా చదవండి: విషాదాంతంగా చిన్నారి మిస్సింగ్ కేసు.. హత్య చేశారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement