Thursday, April 18, 2024

విషాదాంతంగా చిన్నారి మిస్సింగ్ కేసు.. హత్య చేశారా?


హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. శనివారం  ఆ చిన్నారి రాజేంద్రనగర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు. రాజేంద్రనగర్‌లోని జ‌లాల్‌బాబాన‌గ‌ర్‌కు చెందిన అబ్ధుల్ ర‌హీ, త‌బుస‌మ్ దంపతుల రెండేళ్ల కుమారుడు నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో క‌నిపించ‌కుండా పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ప‌రిస‌ర ప్రాంతాల్లో వెతికారు. ఎంత‌కు క‌నిపించ‌కపోవ‌డంతో పోలీసును ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు ఆధారాలు సేక‌రించారు. బాబు ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో చిన్నారి మృతదేహాం చెరువ వద్ద లభించింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు అబ్దుల్ రహీమ్, తబసుమ్ కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని చంపేసి చెరువులో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ వార్త కూడా చదవండిః కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకున్న 120 ఏళ్ల బామ్మ

Advertisement

తాజా వార్తలు

Advertisement