Saturday, May 4, 2024

న‌ష్టాల్లో ఛార్మీ..పూరీ జ‌గ‌న్నాథ్‌.. న‌ట‌న‌వైపు వెళ్తోన్న నిర్మాత‌లు

హీరోయిన్ గా ప‌లు సినిమాల్లో ఛాన్సులు వ‌స్తున్న స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ నిర్మించిన సంస్థ‌లో చేరి ఆయ‌న‌తో ప‌లు సినిమాల‌ను నిర్మించింది ఛార్మీ. అలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా భాగస్వామ్యం వ్యవహరించిన ఛార్మి.లైగర్ సినిమా తో చాలా నష్టపోయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఛార్మి, పూరి కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ కష్టాల నడుమ చార్మి తన నటన వైపు ఆకర్షితురాలు అవుతోందంటూ టాలీవుడ్ లో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.

నటనపరంగా ఆసక్తి లేనని గత కొద్ది రోజుల క్రితం చెప్పగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో తప్పని పరిస్థితులలో మళ్ళీ నటన వైపు అడుగులు వేయాల్సి వస్తోంది అంటూ ఆమె అభిమానులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై చార్మి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. మరి డైరెక్టర్ పూరి పరిస్థితి ఎలా అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్స్ చేస్తున్నారు. పూరి కూడా పలు చిత్రాలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నారు తను కూడా నటన వైపే వెళ్తారేమో చూడాలిమరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement