Saturday, May 4, 2024

కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం రాయితీ…

బిక్కనూర్ జులై 23 ప్రభా న్యూస్…. కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం చెప్పారు ఆదివారము కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల పరిధిలోగల కేజేఎల్ పౌల్ట్రీ పరిశ్రమను ఆయన సందర్శించారు అక్కడ అధునాతన టెక్నాలజీతో పెంచుతున్న కోళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయనకు పౌల్ట్రీ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు పూర్తి వివరాలు తెలియచేశారు అనంతరం మంత్రి పురుషోత్తం మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో పరిశ్రమల స్థాపించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తుందని తెలిపారు ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార కే జే యల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరాజు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి బిజెపి నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement