Monday, April 29, 2024

దేశంలో కేసులు తగ్గుతున్నా…మరణాలు తగ్గట్లే!!

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి తాజాగా గడచిన 24 గంటల్లో కొత్త‌గా 2,22,315 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,67,52,447 కి చేరింది. అలాగే 2,37,28,011 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా27,20,716 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.మరోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,454 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,03,720 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 3,02,544 మంది కరోనా మహమ్మారిని జయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement