Friday, May 3, 2024

మైలవరం పీఎస్‌లో దేవినేని ఉమాపై కేసు నమోదు

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు దేవినేని ఉమపై కేసు నమోదు చేశారు. ఈ నెల 16న మైలవరంలోని అయ్యప్ప నగర్‌లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలించారు. తన వెంట ఎక్కువ మంది జనాలను తీసుకువెళ్లి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసుల అభియోగం మోపుతూ… బుధవారం నాడే దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమపై కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని మైలవరం నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement