Thursday, May 2, 2024

Breaking : రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి, ముగ్గురికి తీవ్ర‌గాయాలు

కామారెడ్డి ప్రభన్యూస్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెంద‌గా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘ‌ట‌న‌ కామారెడ్డి శివారులోని జాతీయ రహదారి NH44 గర్గుల్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. కారును కంటైన‌ర్ వెనుక నుంచి వ‌చ్చి ఢీ కొట్టడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.

మృతులు బాన్సువాడ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహోధర్ రావు (45), మధుసూదన్ రెడ్డి (47) గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కరీంనగర్ వెళ్లి తిరిగి బాన్సువాడ వైపు వెళుతుండగా ప్ర‌మాదం చోటుచేసుకుంది. దేవునిప‌ల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement