Sunday, May 19, 2024

Breaking: శంషాబాద్ ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఇవ్వాల‌ (సోమవారం) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ ద‌గ్గ‌ర ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చ‌నిపోయారు.

కారు వేగంగా వ‌చ్చి లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement