Monday, April 29, 2024

Breaking News: భ‌వ‌నం కుప్ప‌కూలి… తొమ్మిది మంది మృతి

ఓ భ‌వ‌నం కుప్ప‌కూలి తొమ్మిది మంది మృతిచెందిన విషాధ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. త‌మిళ‌నాడులోని వెల్లూరు జిల్లాలో భారీ వ‌ర్షాల కార‌ణంగా ఓ భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది మృతిచెంద‌గా, మ‌రో ఎనిమిది మందికి తీవ్ర‌గాయాలయ్యాయి. అయితే ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మ‌ర‌ణించ‌డం తీవ్ర ఆవేద‌నకు గురిచేస్తోంద‌ని స్థానికులు అంటున్నారు. ఈ ప్ర‌మాదంపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ సీరియ‌స్ అయ్యింది. పాత భ‌వ‌నాల్లో ఉన్న వారిని వెంట‌నే ఖాళీ చేయించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement