Tuesday, April 30, 2024

Breaking : మంత్రి హ‌రీష్ రావుకి త‌ప్పిన ముప్పు..

శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్ ప్రారంభోత్స‌వానికి మంత్రి హ‌రీష్ రావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. మంత్రి హరీష్ రావు తో పాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి… ఈ ఆసుపత్రి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి మంత్రి హరీష్ రావు… అలాగే ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆసుపత్రిలోని లిఫ్ట్… వైర్లు తెగిపోయి కుప్పకూలింది. లిఫ్టులో ఎక్కువమంది.. ఎక్కడం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంలో… కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన తెలిసిన మంత్రి హరీష్ రావు.. విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.‘

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement