Friday, April 26, 2024

Breaking : జ్యోతిబాపూలే గురుకుల పాఠ‌శాల‌లో 25మంది విద్యార్థులకు అస్వ‌స్థ‌త .. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం ..

నిన్న సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌లం ముత్తంగి జ్యోతిబాపూలే గురుకుల పాఠ‌శాల‌లో 47మంది విద్యార్ధినులు కోవిడ్ బారిన ప‌డ్డారు. కాగా నేడు 25మంది బాలిక‌లు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరంద‌రికి కోవిడ్ టెస్ట్ లో నెగిటీవ్ వ‌చ్చింది. విద్యార్ధినుల‌కు వాంతులు.. విరేచ‌నాలు అయ్యాయి.. 25మందిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాంతో వారిని సంగారెడ్డి హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు. ఈ 25 మందికి ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లు చేయాల‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. కాగా నిన్న చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్ళార‌ని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement