Thursday, April 18, 2024

స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డు అందుకున్న మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డికి స‌న్మానం

స్వచ్ఛ సర్వేక్షన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్రపతి అవార్డు అందుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలాగోపాల్ రెడ్డిని 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్, 4th డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు మురళి యాదవ్ మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం మురళీ యాదవ్ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వచ్చి మేయర్ కు ఆ భగవంతుడి కృపాకటాక్షాలు అందాలని ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ మహిళా నాయకురాలు రఫీయ, తెరాస నాయకులు నాగరాజ్ యాదవ్, హనుమంత్ రావు, 4th డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement