Friday, May 3, 2024

BREAKING : సూర్యాపేట జిల్లాలో 10 సెకన్లపాటు కంపించిన భూమి

సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి 10 సెకన్లపాటు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌లో భూమి కంపించింది. రిక్కటర్‌ స్కేలుపై 3.2 తీవ్రతగా నమోదైంది. భూకంప తీవ్రత స్పల్పంగా నమోదవ్వడం, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే టర్కీలో భూకంపం సంభవించి వేలాది మంది మృతి చెందిన ఘటన మరువకముందే భారత్‌లో కూడా పలు చోట్ల స్వల్ప భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement