Friday, May 3, 2024

Breaking : డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న సాప్ట్ వేర్స్ – ఇద్ద‌రి అరెస్ట్

డ్ర‌గ్స్ త‌ర‌లిస్తోన్న ఇద్ద‌రు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఓ వ్య‌క్తి నుండి ఎండీఎంఏడ్ర‌గ్స్ (25 మాత్రలు), ఎల్‌ఎస్‌డీ (2 స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరం బయలుదేరారు. వీరద్దరి వద్ద డ్రగ్స్ ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు చౌటుప్పల్ బస్టాండ్ వద్ద లారీ ఆపి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 2.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని చౌటుప్పల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన ఆదేశాలతో నల్గొండ జైలుకు తరలించారు. కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీంద్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరిద్దరూ గత కొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement