Saturday, April 27, 2024

Breaking : బ్రిట‌న్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కంటే ‘హుజూరాబాద్’ ఎన్నిక‌ల ఖ‌ర్చు ఎక్కువ‌..’జేపీ’

హుజూరాబాద్ ఎన్నిక‌ల‌పై లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాలు రోజు రోజుకు దిగ‌జారుతున్నాయ‌ని అన్నారు. బ్రిట‌న్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఉభ‌య పార్టీలు పెట్టిన ఖ‌ర్చుకంటే హుజూరాబాద్ లో పెట్టిన డ‌బ్బులు ఎక్కువ‌ని వ్యాఖ్యానించారు. ద‌ళిత‌బంధు త‌ర‌హాలో ఎక్క‌డా ఇంత డ‌మ్ము వృథా కాలేద‌ని అన్నారాయ‌న‌. విద్య‌,ఉద్యోగం,ఉపాధి అవ‌కాశాల్లో పెట్టాల్సిన డ‌బ్బును ఇలా ఇవ్వ‌డం అనైతిక‌మ‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన అవ‌కాశాలు ఇవ్వాల్సింది పోయి నేరుగా రూ. ల‌క్ష‌లు ఇవ్వ‌డం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement