Friday, April 26, 2024

పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని టీడీపీ ధర్నా

ప్రతిపాడు, ( ప్రభ న్యూస్ ): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలన్న డిమాండ్ తో, అన్ని పెట్రోల్ బంకులు దగ్గర ధర్నాకు పిలుపు ఇచ్చిన మేరకు పార్టీ నాయకుడు గింజుపల్లి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ప్రతిపాడు బస్ స్టాండ్ సెంటర్ లోని హెచ్ పి పెట్రోల్ బంకు దగ్గర పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలు తగ్గించి వినియోగదారులకు కొంత ఉపశమనం కల్పించినప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో తగిన విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివ రాంప్రసాద్, కుర్రిసుబ్బారెడ్డి, కాసు పెంటా రెడ్డి, కొండ్రుపాడు సుబ్బారావు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement