Saturday, May 18, 2024

Breaking: తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ బోర్డ‌ర్‌లో యాక్సిడెంట్‌.. కంటైనర్ బోల్తా, డ్రైవర్ కు తీవ్ర గాయాలు

వాజేడు (ప్రభ న్యూస్): తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ బోర్డ‌ర్‌లో ఇవ్వాల రాత్రి (శ‌నివారం) ఓ కంటైన‌ర్ లారీ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ములుగు జిల్లా ప‌రిధి, రాష్ట్ర బోర్డ‌ర్‌లోని లొట్టపిట్ట గండి, భీరమయ్య గుట్టల్లో కంటైనర్ అదుపుతప్పిన బోల్తా కొట్టిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం నుండి తెలంగాణకు ఐరన్ తరలిస్తున్న నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement