Sunday, May 5, 2024

తెలంగాణ‌లో పెరిగిన కొవిడ్‌ కేసులు.. తాజాగా 652 మందికి క‌రోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 652 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 13, 772కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 667 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4711కు చేరింది. కరోనా కేసులు కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ప్రతీ రోజూ 30వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు.

క్రమంగా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో టెస్టుల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 33, 017 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 297 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 18, కరీంనగర్‌ 28, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 51, రంగారెడ్డిలో 57, నల్గొండ 23, సంగారెడ్డిలో 10, పెdద్దపల్లి 20 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement