Sunday, April 28, 2024

BREAKING : కారు బోల్తా యువకుడు మృతి

ధరూర్ (ప్రభ న్యూస్) కారు బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం ధరూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని చంద్రాయన గుట్ట నమాజ్ గాడ్ ప్రాంతానికి చెందిన ISLఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎనిమిది మంది కలిసి కోట్పల్లి ప్రాజెక్టు కు స్నేహితులతో కలిసి పరిసర ప్రాంతంలోని అందాలను తిలకించేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో దారుర్ గ్రామ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపాన రాగానే అతివేగంతో వస్తున్న కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో కారు నడిపిస్తున్న జియా(19) యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తనతో పాటు ఉన్న మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు నరేందర్ తన సిబ్బందితో కలిసి స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన జియా మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన స్నేహితుడు మద్ద శీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement