Monday, April 29, 2024

Rahul tour: మణిపూర్ లో రాహుల్ పర్యటనకు బ్రేక్

రెండు జాతుల మధ్య దాడులతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మణిపూర్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి ఘర్షణలకు కేంద్ర బిందువైన చురాచాంద్ పూర్ కు ఆయన బయల్దేరారు. అయితే, ఆయన కాన్వాయ్ ను పోలీసులు మార్గమధ్యంలోనే ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ వద్ద ఆపేశారు. పరిస్థితులు బాగోలేవని… రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్ లో అక్కడకు వెళ్లాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ… హింసాత్మక ఘటనలు పునరావృతమవుతాయని తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు. కాన్వాయ్ ను బిష్ణుపూర్ లోనే వదిలేయాలని కోరామని తెలిపారు. రాహుల్ పర్యటించే ప్రాంతంలో బుధవారం రాత్రి అల్లర్లు జరిగాయని.. పరిస్థితి పూర్తిగా అదుపులో లేనందున ఆ ప్రాంతాన్ని సందర్శించే ఆలోచనను వాయిదా వేసుకోవాలని రాహుల్‌ను కోరారు పోలీసులు. ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో పర్యటించడం ఏ మాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఇంఫాల్ కు తిరుగుపయనమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement