Wednesday, May 15, 2024

అమర్‌నాథ్‌ యాత్రకు బ్రేక్‌.. కాశ్మీర్ లో భారీ వర్షాలు

అమర్‌నాథ్‌ యాత్రకు మంగళవారం తాత్కాలిక బ్రేక్‌ పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపేసినట్టు అధికారులు పేర్కొన్నారు. పహల్గామ్‌, బల్తాన్‌ రూట్లలోని క్యాంపుల వద్దనే యాత్రికులను ఆపేశామని తెలిపారు. మంగళవారం ఉదయం కశ్మీర్‌లో భారీ వర్షాలు కురిశాయి.

ఎడతెరపి లేని వర్షాల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపేశామని, వాతావరణ పరిస్థితులు మెరుగైన తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమౌతుందని చెప్పారు. మరోవైపు కశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement