Sunday, May 5, 2024

Nizamabad: బాలుని హత్య… నిజాంసాగర్ కెనాల్ లో లభ్యమైన శవం

అభంశుభం తెలియని బాలున్ని హత్యచేశారు. చేతులను దారంతో కట్టి వేసి నిజాంసాగర్ కాలువలో పారేశారు. నగరంలోని ఆరవ టౌన్ పరిధిలోని బాబాన్ సాహబ్ పహడ్ వద్ద శుక్రవారం బాలుడి డెడ్ బాడీ దొరికింది. నగరంలోని ఆటో నగర్ నయా బ్రిడ్జి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్ ( 7) గురువారం సాయంత్రం కనిపించకుండా పోయాడు. ఉదయం వేళ నిజాం సాగర్ డి-54 కాలువలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం అందించగా.. పోలీసులు, కుటుంబ సభ్యులు బాలుడిని ఫయాజ్‌గా గుర్తించారు. ముక్కు పచ్చలారని బాలుడి రెండు చేతులకు దారం కట్టి కాలువలో పడేసేటంత కక్ష్యలకు కారణం ఏమిటో తెలియడం లేదు. అమావాస్య సందర్భంగా మంత్రగాళ్లు మంత్రాలు చేసి బాలుడిని హతమార్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement