Friday, April 26, 2024

FLASH: అదనపు కట్నం కోసం నవ వధువు హత్య

అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి భర్త, అత్తమామలు కలసి నవవధువును హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకుంది. ముదిగుబ్బ మండలం రాచువారిపల్లి తాండాకు చెందిన చంద్రానాయక్ కుమార్తె అఖిలాబాయిని రైల్వే శాఖలో పని చేస్తూ గుంతకల్ లో నివాసం వున్న బాలాజీనాయక్ కుమారుడు సుబ్రహ్మణ్యం నాయక్ కు ఇచ్చి నవంబర్ 2021లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే, పెళ్లైన 15 రోజుల నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని అఖిలాబాయి వారి తల్లిదండ్రులకు తెలియజేసింది. అయితే ఆమె తల్లిదండ్రులు కొద్దిరోజులు గడిస్తే అన్నీ సర్దుకుపోతాయని నచ్చజెప్పడంతో అఖిలాబాయి తన అత్తింట్లో తనపై వేధింపులను భరిస్తూ వచ్చింది. గురువారం రాచువారిపల్లి నుంచి తన భర్త సుబ్రహ్మణ్యం నాయక్.. తన తల్లిదండ్రులతో కలిసి కత్తితో మెడమీద పొడిచి హత్య చేశారు. పోలీస్ లను పక్కదారి పట్టించాలని భావించి స్వయంగా సుబ్రహ్మణ్యం తన తల్లిదండ్రులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అది హత్యేనని ప్రాథమిక విచారణలోనే పోలీసులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement