Monday, April 29, 2024

క్యాన్స‌ర్ బారిన ప‌డి తుదిశ్వాస విడిచిన – సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్

గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతూ తుదిశ్వాస విడిచారు టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్. కాగా ఆయన అంత్యక్రియలను హైదరాబాదులోని మహాప్రస్థానంలో రేపు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ‘చాదస్తపు మొగుడు’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు శరత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బాలకృష్ణ, సుమన్ లతో ఆయన మంచి విజయాలను అందుకున్నారు. బాలయ్యతో ఆయన ‘పెద్దన్నయ్య’, ‘వంశానికొక్కడు’, ‘వంశోద్ధారకుడు’, ‘సుల్తాన్’ సినిమాలు రూపొందించారు. సుమన్ తో ‘చాదస్తపు మొగుడు’, ‘పెద్దింటి అల్లుడు’, ‘బావ బావమరిది’, ‘చిన్నల్లుడు’ వంటి సినిమాలు తెరకెక్కించారు. శరత్ మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement