Friday, April 26, 2024

నల్గొండ జిల్లాలో విషాదం.. నీటికుంటలో పడి బాలుడు మృతి

నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ బాలుడు నీటి కుంటలో పడి మృతి చెందాడు. చండూరు మండలం ఇడికుడ గ్రామానికి చెందిన వెంకటయ్య పంతులు వెంట తన మనుమడు బద్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తాత పనుల్లో నిమగ్నం కాగా బద్రి (6) ఆడుకుంటూ పక్కనే పుల్లెంల గ్రామం వెళ్లేదారిలో ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో గుంతలో నీటిని బయటకు తీయగా బాలుడి మృతదేహం లభ్యమైంది. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

Advertisement

తాజా వార్తలు

Advertisement