Saturday, April 20, 2024

నేను పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ నేత తుమ్మల

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు బయటకు రావడం లేదు. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందని, పార్టీని వీడుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే సదరు వార్తలపై తాజాగా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు.

తాను పార్టీ మారడం లేదని, ఆ ఉద్దేశం కూడా లేదని తుమ్మల స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే తన రాజకీయ ప్రయాణమని తెలిపారు. రాజకీయాల్లో తాను నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, సీఎం కేసీఆర్ భారీగా నిధులను ఖర్చు చేశారని తుమ్మల పేర్కొన్నారు. కాగా గతంలో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Advertisement

తాజా వార్తలు

Advertisement