Friday, May 17, 2024

విజృంభిస్తున్న భారత బౌలర్లు..

భారత్‌తో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను 2-0తో లీడ్ లో ఉన్న భార‌త్.. HPCA స్టేడియంలో శ్రీలంకతో జరిగే మూడవ చివరి గేమ్‌లో భారత్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పత్తుమ్ నిస్సాంక (1)ను, అసలంక(4)ను ఆవేశ్ ఖాన్ అవుట్ చేయగా, ధనుష్క గుణతిలక (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు . కాగా, 6 ఓవ‌ర్ల‌కు 18 ర‌న్లు చేసి 3 వికెట్లు కొల్పోంది శ్రీలంక‌. టీమిండియా ఇప్పటికే ఈ సిరీస్ ను 2-0తో చేజిక్కించుకోవడం తెలిసిందే. దాంతో ఈ చివరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement